KMR: దేశ మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రావ్ సేవలు మరువలేనివని, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం బిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో, జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు ఉన్నారు.