GDWL: మల్దకల్ గ్రామానికి చెందిన కుమ్మరి శేషన్న అనే రైతు గురువారం తన వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన తోటి రైతులు వెంటనే సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే శేషన్న బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.