ADB: తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. బాన్స్ వాడలో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ పట్టణంలో నిన్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.