BHPL: కాటారం(M) కేంద్రం నుంచి జగ్గయ్యపల్లె గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాహనాదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రాత్రి వేళలో ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.