BDK: శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలో త్రివేణి – కృష్ణవేణి విద్యాసంస్థలు గత 12 ఏళ్లుగా చేస్తున్న సేవా కార్యక్రమం ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగింది. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల దాహార్తిని తీర్చేందుకు సుమారు 50 వేల మజ్జిగ ప్యాకెట్లు, 50 వేల మంచినీటి ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.