KNR: జమ్మికుంట మార్కెట్కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందని ఉన్నత శ్రేణి కార్య దర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్కు రైతులు 44 వాహనాల్లో 368 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,500, కనిష్ఠంగా రూ. 6,300ల ధర పలికింది. పత్తి ధర నిన్నటి కంటే రూ. 50 తగ్గింది.