NRPT: జిల్లాలో ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు బిగిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్సై కృష్ణచైతన్య హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని పలు కూడళ్లలో తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు. ఇటువంటి సైలెన్సర్ల వల్ల శబ్ద కాలుష్యం పెరిగి పాదచారులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.