NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నేడు బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సోలార్ ప్యానెల్ ఏర్పాటు కార్యక్రమాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించనున్నారు. ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ అందించే లక్ష్యంతో అధికారులు ఈ ప్రణాళికను సిద్ధం చేశారు.