KMM: నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన రైతు చూడితో ఉన్న గేదె అనారోగ్యం పాలవగా రాజేశ్వరపురం పశువైద్యశాలకు తీసుకువచ్చాడు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో తన కింద స్థాయి వైద్యుడు చికిత్స చేశాడు. అతనికి వచ్చి రాని వైద్యంతో వైద్యం చేయాగా గేదె మృతి చెందింది. సకాలంలో వైద్యుడి చేత వైద్యం అందితే తన గేదె చనిపోయి ఉండేది కాదు అని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.