NZB: ధర్పల్లిలో శనివారం సర్పంచ్ సీహెచ్.శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ప్రతి రెండు నెలలకోసారి జరిగే ఈ సభలో భాగంగా, గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. గత రెండు నెలల్లో నూతన పాలకవర్గం చేపట్టిన కార్యక్రమాలు, వాటికి సంబంధించిన జమా ఖర్చుల వివరాలను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ప్రజలకు చదివి వినిపించారు