MDK: పాపన్నపేటలో వాహనాల తనిఖీలలో 224 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి తరలిస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా బియ్యం బయటపడింది. సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.