WGL: పర్వతగిరి మండలం రోళ్లకల్లు గ్రామంలో నిర్మిస్తున్న సేవాలాల్ మహారాజ్ ఆలయానికి హనుమకొండ ఆర్టీసీ డిపో ఏవో లూనావత్ రవీందర్ రూ. 50 వేల విరాళం ఇవాళ అందించారు. ఆలయ నిర్మాణంతో పాటు మేరమా యాడి ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నట్లు కమిటీ గౌరవ అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవిమంగ్యా నాయక్, నాగపురి లింగం, మంజుల శ్రీనివాస్ పాల్గొన్నారు.