JGL: భీమవరం మండలంలోని మోత్కురావుపేట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం అటవీ అధికారులతో సమీక్షించారు. మోత్కురావుపేట-చందుర్తి అటవీ మార్గంలో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. పులి కదలికలు ఉన్నందున రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావొద్దన్నారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.