సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహం ఆదేశాల మేరకు నూతనకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్, డ్రగ్స్ సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన పోలీస్ కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సమ్మద్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు.