RR: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షాద్నగర్, మొయినాబాద్, మహేశ్వరం డివిజన్లకు చెందిన డీసీపీ పరీక్ష కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని కేంద్రాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని అధికారులు తెలిపారు.