SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నాగమణి అనే ఉద్యోగి తన నిజాయితీని చాటుకున్నారు. వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన రేసు సతీశ్ అనే భక్తుడి 4 తులాల బంగారు బ్రాస్లెట్ పోయింది. ఆలయ పారిశుద్ధ్య ఉద్యోగి డప్పు నాగమణికి దొరకగా.. ఆలయ అధికారుల సమక్షంలో సతీష్కు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు.