MDK: నిజాంపేట మండలం చల్మెడలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా బొమ్మెన శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా కాకి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా మహిపాల్, కోశాధికారిగా భాస్కర్ రెడ్డి, సలహాదారుగా మల్లేశం ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.