బాపట్ల: జిల్లాలో పోలీసులు ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రైవర్లకు ఆల్కహాల్ పరీక్షలు, వాహన పత్రాలను పరిశీలిస్తున్నామన్నారు. బస్సుల్లో ప్రమాదకర వస్తువులు లేకుండా, ప్రమాదాల నివారణపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.