MNCL: మంచిర్యాల ‘శుభ్రత-ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ డివిజన్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.