KMM: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలని అఖిలభారత సంఘటిత కార్మిక జిల్లా అధ్యక్షులు విప్లవకుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి, రేగులచలక, పాపటపల్లి పంచాయితీల్లో జాతీయ ఉపాధి హామీ పథకం పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. పేదలను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం కాలరాస్తుందన్నారు.