SDPT: కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తాగునీటి ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టారు. సర్పంచ్ బోయిని సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరిచి క్లోరిన్ కలిపి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.