NGKL: బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ శనివారం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి ఉచిత సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో మూడు గ్రామాలు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు.