ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సరండి రోడ్డు వద్ద SI మహేందర్ శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ద్వి చక్రవాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎనైజర్తో తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.