NLG: దేవరకొండలో బీజేపీ రూరల్ మండలం ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు నేనావత్ రామునాయక్ మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణంలోనూ ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిరంతరం జరుగుతుందని అన్నారు. తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో కూడా దేశ ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదన్నారు.