NLG: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముస్లింలకు ప్రభుత్వ రంజాన్ తోఫా కానుకలను పంపిణీ చేశారు. ప్రజాపాలనలో ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అనేక పథకాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పండుగ వేళ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.