NZB: సిరికొండ మండలం రావుట్ల-పిప్పిరి మార్గంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వడగండ్ల వానకు వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. కోతకు వచ్చిన పంట గింజలు నేలరాలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల సర్వే నిర్వహించి పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. చేతికొచ్చిన పంట చేజారిపోవడంతో మండల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.