వెండితెరపై అలరించేందుకు మరో విజువల్ వండర్ సిద్ధమవుతోంది. ఇద్దరు వెర్సటైల్ నటులు విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. దర్శకుడు మణిరత్నం వీరిద్దరితో ఓ క్లాసిక్ లవ్ స్టోరీని ప్రకటించారు. దీనికి AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే పట్టాలెక్కనున్న మణిరత్నం మార్క్ రొమాంటిక్ డ్రామాపై సినీ ప్రియుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.