సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దీర్ఘకాలంగా నలుగుతున్న భూవివాదం ఒకరి ప్రాణం తీసేందుకు దారితీసింది. గ్రామానికి చెందిన మేకల జయరాం అనే వ్యక్తి సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమికి సంబంధించిన తగాదాల నేపథ్యంలోనే ప్రత్యర్థులు పథకం ప్రకారం జయరాంపై దాడి చేసి హతమార్చారని తెలిపారు.