MNCL: మంచిర్యాలలో విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’లో నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని SFI జిల్లా కార్యదర్శి అభినవ్ మండిపడ్డారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, ప్రభుత్వ విద్యను గాలికొదిలేసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.