KMR: జిల్లాలోని పలు వాణిజ్య సంస్థల్లో అక్రమంగా వినియోగిస్తున్న 30 గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారులు శనివారం తెలిపారు. జిల్లాలోని నస్రుల్లాబాద్, నాగిరెడ్డిపేట, మాచారెడ్డి, పాల్వంచ, భిక్కనూరు మండలాల్లో పలు హోటళ్లు, మెస్లు, వాణిజ్య సంస్థల్లో తనిఖీలు చేపట్టినట్టు పేర్కొన్నారు.