WNP: పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన 21 ఏళ్ల అనూషకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ను సంప్రదించారు. సమయానికి చేరుకున్న 108 సిబ్బంది అనూషను వనపర్తి నరసింగపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవం జరిగింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, మరిన్ని 108 సేవలను వినియోగించుకోవాలని జిల్లా మేనేజర్ రత్నమయ్య తెలిపారు.