AKP: మత్స్యకార భరోసా పథకం కింద వేట నిషేధ సమయంలో వారికి అందించే సహాయంపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ఎస్ రాయవరం మండలం పోలవరం గ్రామంలో సర్వే ప్రారంభించారు. సర్వే ద్వారా అర్హులైన వారిని గుర్తిస్తున్నట్లు మత్స్యశాఖకు చెందిన అసిస్టెంట్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు కొరివి బంగారి, టీడీపీ నేత కోడ లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.