ASR: డుంబ్రిగుడ మండలంలోని అరకు సంతబయలు గ్రామంలో గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే అరికట్టాలని ఆదివాసి గిరిజన సంఘం నేతలు పీ. సూర్యనారాయణ, పీ. సత్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామకంఠం, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు.