NDL: కోవెలకుంట్ల మేజర్ గ్రామపంచాయతీకి సంబంధించి వేలం పాటల ద్వారా రూ.35.09 లక్షల ఆదాయం సమకూరినట్లు జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి నరసింహారెడ్డి వెల్లడించారు. బుధవారం కోవెలకుంట్లలోని పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో సంత మార్కెట్, దినసరి కూరగాయల మార్కెట్, కబేళా మార్కెట్ తదితర వాటికి సంబంధించి వేలం పాటలను నిర్వహించారు.