HYD: త్వరలో జరిగే గోదావరి పుష్కరాల దృష్ట్యా సికింద్రాబాద్ డివిజన్ DRM డా. గోపాలకృష్ణన్ ప్రత్యేక దృష్టి సారించారు. సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వైపు వెళ్లే మార్గాలపై రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ట్రాక్ భద్రత అంశాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు.