PDPL: గ్రామాలలో 100% పన్ను వసూలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు సూచించారు. ఇవాళ ఆయన పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడాలని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ, రాజకీయ పార్టీల కార్యాలయాల సైతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రోడ్లపై చెత్త లేకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు.