KRNL: సీఎం సహాయ నిధి పేదలకు వరమని MLA బొగ్గుల దస్తగిరి అన్నారు. ఇవాళ కోడుమూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ.2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎర్ర పకీరయ్య, మందపోగు అంజి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు సహా ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.