RR: శ్రీరామనవమి సందర్భంగా కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవాలయంలో సంప్రదాయంగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరుకావలసిందిగా దేవాలయ ఈవో లావణ్య అధికారిక ఆహ్వాన పత్రాన్ని ఆయనకు అందజేశారు.