SRD: కంగ్టి శ్రీ రామాలయంలో శుక్రవారం శ్రీ రాములోరి తొట్టెల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఉగాది నుంచి ఇక్కడ శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయ ప్రకారంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీరాముడి జన్మఉత్సవం నిర్వహించారు. అనంతరం రాముడి తొట్టెలలో పూలు గులాలు వేసి, బాల రాముడిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.