HNK: శాయంపేట మండలం కేంద్రానికి చెందిన సీనియర్ అడ్వకేట్ గట్ల విజయ్ పాల్ రెడ్డి మాతృమూర్తి గట్ల అహల్యమ్మ ఇవాళ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.