TG: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని, జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తామన్నా.. కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారని మండిపడ్డారు. ఇప్పుడు 50 శాతం పెంచుతామంటే కూడా ఒప్పుకోమంటున్నారని, కాంగ్రెస్కు దమ్ముంటే పార్లమెంట్లో చర్చకు రావాలని సవాల్ విసిరారు.