PDPL: జిల్లాలో BSNL అండర్ గ్రౌండ్ కేబుల్ పనులను వివిధ శాఖల సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రామగుండం ప్రాంతంలో దెబ్బతిన్న కేబుల్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. ఆర్ & బీ, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖల అధికారులు పరస్పర సహకారంతో పనిచేయాలని, కేబుల్లకు నష్టం కలగకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.