NZB: సిరికొండ మండలం కొండూరులో శ్రీరామ నవమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. సీతారామస్వామి శోభాయాత్రను గ్రామ పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ మాలధారులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ‘జై శ్రీరామ్’ నినాదాలతో గ్రామాన్ని మార్మోగించారు. స్వామివారి పల్లకి సేవను గ్రామస్థులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.