NZB: సిరికొండలోని శ్రీ శేష సాయి లక్ష్మీనారాయణ మందిరంలో సోమవారం అశ్వత్థ లక్ష్మీనారాయణ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. రావి చెట్టును స్వామివారిగా, వేప చెట్టును అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తూ అర్చకులు శ్రీకాంత్ పంతులు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. ప్రకృతిలోని పవిత్ర వృక్షాలకు కళ్యాణం చేయడం వల్ల లోకకళ్యాణం జరుగుతుందన్నారు.