MBNR: జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలను పరిరక్షించాలని కోరుతూ గత ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించినా ఎవరు స్పందించలేదని తెలంగాణ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు కాడి ప్రభాకర్ ఆరోపించారు. ఈ విషయమై సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ఫిర్యాదు చేశారు. వెంటనే తకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.