SRCL: తిరుపతి దర్శనం టికెట్ల పేరుతో విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన పూజారిపై బుధవారం కేసు నమోదైంది. బోయినపల్లి ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒద్యారం గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి వద్ద వెంకటేశ్వర ఆలయ పూజారి సాయి తరుణ్ పలు విడతలుగా రూ.18 లక్షలు వసూలు చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.