JGL: క్షయ బాధితులు అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డా. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జగిత్యాల మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో టీబీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులకు క్షయ బాధితులకు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. పల్మనాలజిస్ట్ డా.సునీత దేవి డ్రగ్ రెసిస్టెంట్ టీబీపై ప్రజెంటేషన్ ఇచ్చారు.