MBNR: బాలానగర్ మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 12:30 నుంచి 3:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. జాతీయ రహదారిపై నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల దృష్ట్యా ఈ కోత విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.