AP: ఏపీఐఐసీకి చెందిన 75 వేల ఎకరాలను 22ఏ నుంచి తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామికవేత్తలు ఒప్పందం చేసుకున్న వాటిని 22ఏ నుంచి తొలగించాలని నిర్ణయించింది. కుటుంబానికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో పీఎంఈ జీపీ కింద సాయం చేయాలని, మైక్రో యూనిట్లకు ప్రత్యేక రాయితీలపై రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పట్టణాలు, గ్రామాల్లో కేటగిరీల వారీగా రాయితీ ఇచ్చేందుకు ఆమోదించింది.