MBNR: మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మర్లు ప్రాంతంలో ఓ నూతన పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.